Tuesday, August 2, 2011

నీలం సంజీవరెడ్డి , Neelam Sanjiva Reddy



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -నీలం సంజీవరెడ్డి , Neelam Sanjiva Reddy- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....



ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లా, ఇల్లూరు గ్రామంలో 1913 మే 18 న రైతుబిడ్డగా సంజీవరెడ్డి జన్మించాడు. మద్రాసు థియొసోఫికల్ పాఠశాలలోను, అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలోను చదువుకున్నాడు. 1935 జూన్ 8 న నాగరత్నమ్మను పెళ్ళి చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

ఇప్పటివరకూ మన దేశానికి అధ్యక్షులుగా పనిచేసిన, చేస్తున్న పన్నెండు మందిలో ముగ్గురు తెలుగు వారు కావడం విశేషం. వారిలో మూడవవారు, అధ్యక్షుల్లో ఆరవవారు అయిన నీలం సంజీవరెడ్డి గారికి కొన్ని ప్రత్యేకతలున్నాయి.

గాంధీజీ ప్రభావంతో చదువును త్యాగం చేసి 1931 లో స్వాతంత్ర్యోద్యమంలోకి దూకారు. 1946 లో మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజ్యాంగ రచనా సంఘంలో సభ్యుడిగా పనిచేసారు.

1956 లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి గా పనిచేసిన ఘనత ఆయనది . అంతేకాదు రెండోసారి కూడా 1962 నుంచి 64 వరకూ ముఖ్యమంత్రిగా పనిచేసారు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేసారు.

మరణము -- 01 జూన్‌ 1996

For full details - > Neelam Sanjeeva Reddy
  • =====================================
Visit My website - > Dr.Seshagirirao

No comments:

Post a Comment